20 April, 2026 | 1:41 AM

ఘనంగా శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

20-04-2026 12:00 AM

చేగుంట, ఏప్రిల్ 19: చేగుంట పట్టణ కేంద్రంలో ఆదివారం నాడు దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, పట్టణ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ ఆధ్వర్యంలో చేగుంట గాంధీ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

వారిని నాయకులు మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, ఉపసర్పంచ్ రఫీ,వివిధ గ్రామ సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, మండల  కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, ఎఎంసి డైరెక్టర్లు, వివిధ గ్రామ కాంగ్రెస్ నాయకులు,మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.