21-01-2026 12:16:05 AM
సిద్దిపేట క్రైం, జనవరి 20: రాయ్పూర్లో నిర్వహించిన 45వ జూనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో తెలంగాణ జూనియర్ బాలికల జట్టు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించింది. హోంగార్డుల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి కుమార్తె చిరుకోటి రష్మితారెడ్డి 621 స్కోర్ తో రాణించి, కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ రష్మిత, కోచ్ డాక్టర్ రవిశంకర్ ను అభినందించారు.