12 May, 2026 | 12:08 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

ఢిల్లీ శాసనసభ పక్ష నేతగా అతిశీ

23-02-2025 04:49 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ ని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆప్ శాసన సభాపక్ష భేటీని ఆదివారం నిర్వహించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే సంజీవ్ ఝూ పేరును కూడా ప్రతిపాదించగా, అందరూ అతిశీకి మద్దతు పలికారు. కాల్ కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన అతిశీ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో మొదటి మహిళా ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. ఆప్ శాసన సభాపక్ష భేటీకి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన 22 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తనపై విశ్వాసం ఉంచి, శాసన సభాపక్షనేతగా ఎన్నుకునందుకు కేజ్రీవాల్ తో పాటు ఎమ్మెల్యేలకు అతిశీ ధన్యవాదాలు తెలియజేశారు.