9 April, 2026 | 6:50 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

గురుకుల విద్యార్థుల కిడ్నాప్ కు య‌త్నం

12-12-2025 09:38 AM

మ‌త్తు ప‌దార్థం ఇచ్చి విద్యార్థుల‌ను చిత‌క బాధిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు

విద్యార్థుల‌ను సంగారెడ్డి ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించిన  అద్యాప‌కులు  

మునిపల్లి (విజయక్రాంతి): మండ‌లంలోని లింగంప‌ల్లి గురుకుల పాఠ‌శాలకు ఇద్ద‌రి విద్యార్థులను కిడ్నాప్  చేసేందుకు  యత్నించి మత్తు ప‌దార్థం ఇచ్చి  చిత‌కి బాధిన సంఘ‌ట‌న లింగంప‌ల్లి గ్రామ  శివారులో గురువారం  చోటుచేసుకుంది. ఇందుకు సొంబంధించి పాఠ‌శాల అద్యాప‌కులు, స్థానికులు, విద్యార్థులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.   లింగంప‌ల్లి గురుకుల పాఠ‌శాలకు చెందిన 6వ త‌ర‌గ‌తి  చ‌దువుతున్న సిద్దు, రాకేష్ అనే విద్యార్థులు  పాఠ‌శాల ఆవ‌రణ‌లో ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కారులో వ‌చ్చి  గ్రామ స‌మీపంలో గ‌ల ఉర్దు మీడియం పాఠ‌శాల వెనుకాలకు తీసుకెళ్లి మ‌త్తు ప‌దార్థం ఇచ్చి చిత‌క‌బాదారు. దీంతో చుట్టు ప‌క్క‌ల వారు  గ‌మ‌నించి  పాఠ‌శాల అద్యాప‌కులకు స‌మాచారం అందించ‌డంతో  వెంట‌నే విద్యార్థుల‌ను జ‌హీరాబాద్ ఏరియాసుప‌త్రికి త‌ర‌లించగా మ‌త్తు ప‌దార్థం ఇవ్వ‌డంతో అది ఫోరెన్సీ ల్యాబ్ కు తీసుకెళ్లాల‌ని అక్క‌డి వైద్యుల సూచ‌న  మేరకు సంగారెడ్డి ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.  ఈ సంద‌ర్భంగా విద్యార్థుల ప‌రిస్థితి  నిల‌క‌డ‌గా ఉంద‌ని ప్రిన్సిపాల్ సుర‌భి చైత‌న్య తెలిపారు.