12-12-2025 10:27:33 AM
చింతూరు: శుక్రవారం తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లాలో(Alluri district) బస్సు రోడ్డుపై నుంచి బోల్తా పడిన ఘటనలో కనీసం తొమ్మిది మంది మరణించగా, 22 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. చిత్తూరు నుండి పొరుగున ఉన్న తెలంగాణకు వెళ్తున్న బస్సులో డ్రైవర్, క్లీనర్ సహా 37 మంది ఉన్నారని, వారిలో ఆరుగురు సురక్షితంగా ఉన్నారని వారు తెలిపారు.
చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో దుర్గా ఆలయం సమీపంలో తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అమిత్ బర్దార్ తెలిపారు. బస్సు ఘాట్ రోడ్డు నుంచి పడిపోవడంతో కనీసం తొమ్మిది మంది మరణించారు.ట 22 మంది గాయపడ్డారు. బస్సు పూర్తిగా లోయలోకి పడిపోలేదని బర్దార్ మీడిాయకి చెప్పారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన అన్నారు. మోతుగూడెం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉండటం వల్ల ప్రమాద స్థలంలో బస్సు డ్రైవర్కు వంపు కనిపించకపోవచ్చునని అధికారి తెలిపారు. బస్సు ప్రయాణికులు చిత్తూరు నుంచి తెలంగాణలోని భద్రాచలం శ్రీరామ మందిరానికి వెళ్తున్నారని బర్దార్ తెలిపారు.