15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బీజేపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం!

22-02-2026 12:10 AM
  1. కాంగ్రెస్ గూండాల అరాచకం

బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ ధ్వజం

ఆదిలాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయిందని, బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ గుండాలు హత్యాయత్నానికి ప్రయత్నించడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో పాయల్ శంకర్ మాట్లాడారు.

ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై దాడి చేయడం అనేది చట్ట విరుద్ధమే కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

హిందువులు పూజలు చేయడం, హిందూ భక్తి గీతాలు వినిపించడం కూడా తప్పుగా చూపించే పరిస్థితి రాష్ర్టంలో నెలకొనడం దురదృష్టకరమని అన్నారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయడానికి ఓ వర్గానికి చెందిన వారిపైనే కేసులు పెట్టడం సమంజసం కాదని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.