31 July, 2026 | 8:22 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

వరంగల్ పబ్లిక్ స్కూల్లో అటెండర్ అనుమానాస్పద మృతి

29-07-2025 12:00 AM

వరంగల్ క్రైమ్, జులై 28 (విజయ క్రాంతి): హనుమకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో సోమవారం అటెండర్ పోలెపాక శ్రీనివాస్ అనుమానాస్పదంగా మృతి చెందారు. బట్టుపల్లి గ్రామానికి చెందిన పూలెపాక శ్రీనివాస్ పది సంవత్సరాల నుండి అటెండర్ గా వరంగల్ పబ్లిక్ స్కూల్ లో విధులు నిర్వహిస్తున్నారు. అనుమా నాస్ప దంగా పాఠశాలలో పోలేపాక శ్రీనివాస్ మృతదేహం లభించడంతో విద్యార్థులు పాఠశాల యాజమాన్యనీకి తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ కొనసాగి స్తున్నారు. విలేకరులను పాఠశాల లోపటికి పంపిం చకుండా పోలీసులు, యాజమాన్యం అడ్డుకోవడం కొసమెరుపు. ఏది ఏమైన ప్పటికీ మృతిని కుటుంబ సభ్యులకు సమా చారం అందజేసి మంతనాలు జరుపు తున్నట్లు సమాచారం. మృతునికి ఒక కొడుకు, ఇద్దరూ కూతుళ్లు, భార్య ఉన్నట్లు సమాచారం.