calender_icon.png 2 February, 2026 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంపెళ్ళగూడెం జవాన్‌కు అవార్డు

02-02-2026 12:56:28 AM

కారేపల్లి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): దేశ సరిహద్దులో ప్రజల భద్రతకు ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న  సశస్త్ర సీమాబల్(ఎసఎస్బీ) జవాన్‌గా పని చేస్తున్న కారేపల్లి మండలం గుంపెళ్ళగూడెంకు చెందిన దారావత్ వీరు అవార్డు అందుకున్నారు. వీధి స్థాయిలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన అందించిన నిష్ఠావంతమైన సేవలకు గుర్తింపుగా ప్రశంస పత్రం మరియు ప్రత్యేక పురస్కారంను ఆర్మీ అధికారులు అందజేశారు.

ఈసందర్బంగా గుంపెళ్లగూడెంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో  ఎసఎస్బీ జవాన్ దారావత్ వీరు సేవలను సర్పంచ్ గుగులోత్ కష్ణవేణి వీరునాయక్ కొనియాడారు. దేశరక్షణలో గుంపెళ్ళగూడెంకుచెందిన యువకులు ఎందరో భాగస్వాములుగా ఉన్నారని వారిత్యాగాలు వెలకట్టలేనివని, వారు గ్రామానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యోగ సంఘ ప్రతినిధులు గుగులోత్ శంకర్, బానోత్ వీరన్న, బానోత్ రమేష్ (ఆర్మీ) గ్రామ పెద్దలు గుగులోత్ వీర బాబు, లకావత్ రాము తదితరులు పాల్గొన్నారు.