1 May, 2026 | 2:07 AM

దోరకుంటలో పౌర హక్కులపై అవగాహన సమావేశం

01-05-2026 12:43 AM

కోదాడ ఏప్రిల్ 30: దోరకుంట గ్రామంలో ఇందిరా కాలనీ నందు గురువారం పౌర హక్కుల అవగాహనా సమావేశం నిర్వహించారు. సర్పంచ్ పాలకి సురేష్ మాట్లాడుతూ సమానత్వం గౌ రవం మరియు వివక్షకు వ్యతిరేకంగా ఉన్న హక్కుల గురించి వివరంగా తెలియజేశారు.

ఎస్సీ ఎస్టీ 1989 ఆక్ట్ గురించి అవగాహన కల్పించి ఎవరికైనా అన్యాయం జరిగితే చట్టపరంగా ఎలా చర్యలు తీసుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ జగదీష్, సెక్రటరీ వెంకటేశ్వర్లు ఏఎస్‌ఐ లక్ష్మీనారాయణ, జి పి ఓ జబ్బార్, SC వెల్ఫేర్ అధికారి సైదులు వార్డు మెంబర్స్ పాలడుగు జాన్, తిరుమల చారి, గద్దల వెంకటేశ్వర్లు, కస్పరాజు సురేష్, ఒగ్గు నాగేంద్రబాబు, సోమపంగు గోపి, మోలుగురు ఏసోబు, సొందు పాశం వీరస్వామి, రవి, నారకట్ల ప్రసాద్ పాల్గొన్నారు.