27 July, 2026 | 12:04 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

సైబర్ నేరాలపై అవగాహన

04-06-2026 02:21 AM

మణుగూరు, జూన్ 3,( విజయక్రాంతి) : పట్టణంలోని  సురక్ష బస్టాండ్ ఏరియాలో ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలకు సైబర్ నేరాలపై ఎస్త్స్ర రాఫ్ బుధవారం అవగా హన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవ ద్దని హెచ్చరించారు.

ఆన్లైన్లో ఉద్యోగాలు, రుణాలు, బహుమతులు, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్ డెస్క్ కు ఫిర్యాదు చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచిం చారు. సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రజల అప్రమత్తతే ప్రధాన ఆయుధమని పేర్కొన్న ఎస్త్స్ర రాఫ్, డిజిటల్ లావాదేవీల సమయంలో భద్రతా ప్రమాణాలను తప్ప నిసరిగా పాటించాలని కోరారు. ఈ అవ గాహన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, స్థానిక వ్యాపారులు, ప్రజలు పాల్గొని సైబర్ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.