ఔషధ నియంత్రణ అవగాహన
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఔషధ నియంత్రణ, నియంత్రణ వ్యవస్థ బలోపేత దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డ్రగ్ ఇన్స్పెక్టర్ అశ్విని ఆధ్వర్యంలో ఫార్మాసిస్టులు, మెడికల్ షాప్ యజమానులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత పదార్థాలపై నియంత్రణ అవసరాన్ని వివరించి, ఔషధాల సరైన వినియోగం, షెడ్యూల్డ్ మందుల నిబంధనలపై అవగాహన కల్పించారు.
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించరాదని డ్రగ్ ఇన్స్పెక్టర్ సూచించారు. కార్యక్రమం అనంతరం డ్రగ్స్ కంట్రోల్ క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సీతారాం, డీడబ్ల్యూఓ భాస్కర్, ఈగిల్ టీం సభ్యుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.




