1 June, 2026 | 4:20 PM

Breaking News

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం   •   జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు   •   అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్   •   వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం   •   తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •   డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి   •  

జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు

01-06-2026 03:50 PM

బోథ్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బోత్ మార్కెట్ యార్డులో జొన్న పంట తూకం కోసం రైతుల మధ్య కొట్లాట జరిగింది. పంట తూకం వేయించడం పై అధికారుల పర్యవేక్షణ కురవడంతో అంగ బలం ఉన్నవారి దే పై చేయగా నిలుస్తున్నదని రైతులు వాపోతున్నారు . పంట తూకానికి తీసుకువచ్చి దాదాపు 15 రోజులు అవుతున్న తూకం వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని కొంతమంది రైతులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. సోమవారం రోజున పంట తూకం కోసం అవసరమైన కాంట తమ కంటే తమకు తూకం వేయాలని వాగ్వివాదానికి దిగారు.

దీంతో కొంతమంది రైతులు కాంటాను తీసుకొని తమ జొన్నల బస్తాల దగ్గరికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు దీంతో కాంటాను పట్టుకొని రైతులు అటూ ఇటూ వాదులు ఆడడంతో రైతుల చేతికి గాయాలయ్యాయి. పంట పండించి అమ్ముకుందామంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు అంటున్నారు. ప్రణాళికబద్ధంగా పంటను కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఉండవని మార్కెట్ పై అజమయిసి కోల్పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.