09-12-2025 03:37:16 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించామని ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్ తెలిపారు. మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు వాటికి విధించే శిక్షలు, రాంగ్ రూట్లో, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే నష్టాలను వివరించారు. రోడ్డు దాటేటప్పుడు, ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అఖిల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు సుమిత్ర, సునీత, లక్ష్మణ్, శ్రీనికర్, నీరజ కొండల్ రెడ్డి పాల్గొన్నారు.