12 March, 2026 | 9:57 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అరైవ్-అలైవ్ పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న

14-01-2026 12:06 AM

మునిప‌ల్లి,(విజయక్రాంతి): రోడ్డు భ‌ద్ర‌త వారోత్స‌వాల్లో భాగంగా అరైవ్.. అలైవ్ ప్రోగ్రాంపై  మంగ‌ళ‌వారం నాడు  మండ‌లంలోని బుదేరా చౌర‌స్తాలో  ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని మునిప‌ల్లి ఎస్ఐ రాజేష్ నాయ‌క్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎస్ఐ రాజేష్ నాయ‌క్ మాట్లాడుతూ... రోడ్డు ప్ర‌మాదాలపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు,   ప్ర‌యాణికులను త‌మ‌త‌మ  గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేసే దిశ‌గా ఈ అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని పోలీసు శాఖ రూపొందించింద‌న్నారు. అందుకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని,  అతివేగం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం, మైనర్ డ్రైవింగ్ చేయరాదనే విషయాలు ప్ర‌జ‌లు తెలుసుకోవాల‌ని సూచించారు. 

అలాగే  ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలులో ఉంటాయ‌ని,  రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు  రోడ్డు ఇరువైపులా వాహనాలు నిలుప‌రాద‌న్నారు.  ముఖ్యంగా  అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వలన ముందు వెళ్తున్న వాహ‌న‌దారుల‌కు ఇబ్బందులై ప్ర‌మాదాల‌కు గురి అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు.  ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా ప్ర‌భుత్వం నిర్దేశించిన  నిబంధ‌న‌లు  పాటించి, తమ ప్రయాణాన్ని సురక్షితంగా  విజయవంతంగా ముగించాలని  ఆయ‌న కోరారు.