calender_icon.png 3 June, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగా థీమ్ 'వన్ ఎర్త్-వన్ హెల్త్' పై అవగాహన కార్యక్రమం

27-05-2025 07:47:52 PM

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగ దినోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మెడికల్ ఆఫీసర్ కవిత(Medical Officer Kavitha) అన్నారు. 11వ ప్రపంచ యోగా దినోత్సవం(World Yoga Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యోగా థీమ్ వన్ ఎర్త్ వన్ హెల్త్(One Earth One Health) అనే నినాదంతో యోగ 2025 జూన్ 21న నిర్వహించాలని అందులో భాగంగా మంగళవారం గ్రామపంచాయతీ కమ్యూనిటీ హాల్ వద్ద యోగ యొక్క ప్రాముఖ్యతను ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ నారాయణపురం మెడికల్ ఆఫీసర్ ఏ.కవిత ప్రజలకు వయోవృద్ధులకు యువకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ కవిత, పంచాయతీ కార్యదర్శి పగిళ్ల శ్రీనివాస్, యోగ ఇన్స్ట్రక్టర్లు సిలువేరు సైదులు, ఝాన్సీ, ఆశ వర్కర్ సరిత, ప్రజలు పాల్గొన్నారు.