22 May, 2026 | 9:51 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

సీఎం కప్ క్రీడలపై అవగాహన ర్యాలీ

14-01-2026 12:00 AM

వాంకిడి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ క్రీడలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) జ్యోత్స్న ఆధ్వర్యంలో వాంకిడి మండల కేంద్రంలో యువకులతో, అధికారులతో కలిసి ప్రచా ర ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా  సీఎం కప్ క్రీడల ప్రాముఖ్యత, పోటీల్లో పాల్గొనే విధానం, నమోదు ప్రక్రియ గురించి ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న యువకులకు ఎంపీడీవో వివరించారు. ఆమె మాట్లాడుతూ, క్రీడలు యువతలో ఆరోగ్యం, ఉత్సా హాన్ని పెంపొందిస్తాయని వివరించారు.

సీఎం కప్ క్రీడల ద్వారా మండల యువకులు రాష్ట్ర స్థాయిలో పోటీపడి పతకాలు సాధించే అవకాశం ఉందన్నారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచి, మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ ల నుంచి యువకులు పాల్గొ నేలా అధికారులు గ్రామీణ యువతను ప్రోత్సహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వాంకిడి సర్పంచ్ చునార్కర్ సతీష్, ఎంపీఓ ఖాజా అజిజు ద్దీన్, కార్యాలయ సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శు లు, స్థానిక యువకులు తదిత రులు పాల్గొన్నారు.