15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి..

26-03-2025 11:47 PM

పటాన్ చెరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ.. 

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..

సంగారెడ్డి (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. బుధవారం పటాన్ చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీసులకు పలు సూచనలు చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రికార్డ్ అప్ టు డేట్ ఉండాలని అన్నారు. అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ భాద్యతాయుతంగా విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. 

పటాన్ చెరు హైదరాబాద్ లో భాగమని, అధిక ట్రాఫిక్ రద్దీ అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం, సంబంధిత అధికారులతో మాట్లాడి బోలార్డ్స్ వేయించడం, విజిబుల్ పోలిసింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, పటాన్ చెరు డియస్పి రవీందర్ రెడ్డి, పటాన్ చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.