10-05-2025 12:00:00 AM
బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, మే 9 (విజయక్రాంతి) : భక్తి, శాంతి, రక్షణకు మార్గం... అయ్యప్ప శరణమని బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 - చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.స్థానిక హనుమాన్ దేవాలయంలో స్వామి వారికి పూజలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు వరద రాజు, శ్రీశైలం యాదవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.