09-11-2025 12:05:16 AM
టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరియన్, రాజా రవీంద్ర, అక్షయ్ లఘుసాని, విష్ణు ఓ అయ్, కార్తికేయ దేవ్, కశ్యప్, విస్మయ, మాల్వి మల్హోత్రా, సమద్ధి ఆర్యల్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ట్రెండీ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ చిత్రంతో గుణి మాచికంటిని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం మేఘాలయలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.
పూర్తి సినిమాను అక్కడే చిత్రీకరించనున్నారు. నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. “మా బా బా బ్లాక్ షీప్’ కథంతా నార్త్ ఈస్ట్ ఇండియాలో సాగుతుంది. అందుకే, మేఘాలయాలో చిత్రీకరిస్తున్నాం. ఎప్పుడూ వర్షం కురుస్తూ ఉండే సోహ్రాలో షూటింగ్ చేయడం చాలా కష్టం. అన్నిటినీ అధిగమించి మా టీమ్ ఎంతో కృషి చేస్తున్నారు. మేఘాలయ సీఎం కన్రాడ్ కే సంగ్మా మా సినిమా యూనిట్ను కలిసి శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.