07-02-2026 12:00:00 AM
ముషీరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): బాబా శ్యామ్ కు అత్యంత ఇష్టమైన ఫాల్గుణ మాసం ఫిబ్రవరి 8 న వేలాదిమంది భక్తులతో శ్రీ బాబా శ్యామ్ భారీ రథ యాత్రను నిర్వహిస్తున్నట్లు బాబా శ్యామ్ రథశోభ యాత్ర కమిటీ చైర్మన్ ఇంద్రకరణ్ అగర్వాల్, వైస్ చైర్మన్లు రామ్దేవ్ అగర్వాల్, పురుషోత్తం దాస్ గోయల్లు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాత్రకు సంబందించిన వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ యాత్ర చార్మినార్, మహాదేవ్ ఆలయం నుండి ప్రారంభమై, ఆఫ్జాల్ గంజ్, గౌలిగూడ, చాదర్ ఘాట్, నింబోలి అడ్డా మీదుగా కాచిగూడలోని వీరన్న గుట్ట శ్రీ శ్యామ్ మందిర్ కు చేరుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో చంద్రకాంత్ డకోటియా, అమిత్, రాంనిరంజన్, సంతోష్, నర్సింగ్, జీవన్ భాటి, అభిషేక్ శర్మ, సుశీల్, గోవింద్ పొద్దార్, చంద్రకాంత్ డకోటియా, కృష్ణ కుమార్ బడేగావ్వాలే, ఇంద్రకరణ్, రామ్దేవ్, రాజ్కుమార్ విగ్, కపిల్ పాల్గొన్నారు.