15 June, 2026 | 9:25 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

8న బాబా శ్యామ్ భారీ రథ్ యాత్ర

07-02-2026 12:00 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): బాబా శ్యామ్ కు అత్యంత ఇష్టమైన ఫాల్గుణ మాసం ఫిబ్రవరి 8 న వేలాదిమంది భక్తులతో శ్రీ బాబా శ్యామ్ భారీ రథ యాత్రను నిర్వహిస్తున్నట్లు బాబా శ్యామ్ రథశోభ యాత్ర కమిటీ చైర్మన్ ఇంద్రకరణ్ అగర్వాల్, వైస్ చైర్మన్లు రామ్దేవ్ అగర్వాల్, పురుషోత్తం దాస్ గోయల్‌లు తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాత్రకు సంబందించిన వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ యాత్ర చార్మినార్, మహాదేవ్ ఆలయం నుండి ప్రారంభమై, ఆఫ్జాల్ గంజ్, గౌలిగూడ, చాదర్ ఘాట్, నింబోలి అడ్డా మీదుగా కాచిగూడలోని వీరన్న గుట్ట శ్రీ శ్యామ్ మందిర్ కు చేరుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో చంద్రకాంత్ డకోటియా, అమిత్, రాంనిరంజన్, సంతోష్, నర్సింగ్, జీవన్ భాటి, అభిషేక్ శర్మ, సుశీల్, గోవింద్ పొద్దార్, చంద్రకాంత్ డకోటియా, కృష్ణ కుమార్ బడేగావ్వాలే, ఇంద్రకరణ్, రామ్దేవ్, రాజ్కుమార్ విగ్, కపిల్ పాల్గొన్నారు.