09-06-2025 12:00:00 AM
మంచిర్యాల, జూన్ 8 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలోనీ మంచిర్యాల క్లబ్ లో స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యం లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షి ప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా అతిథిగా ఎస్ టి పి పి డీజీఎం పంతులు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మీనా రెడ్డిలు హాజరై బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారు లు క్రమశిక్షణతో పాటు చదువు, ఆటలలో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ క్రీడ అభి వృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన బాడ్మింటన్ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని ఆటను కొనసాగించాలన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
బ్యాడ్మింటన్ క్రీడ పోటీలకు సహకరించిన మంచిర్యాల క్లబ్ కమిటీ వాళ్లకు, స్వరూప హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్యాడ్మింటన్ ఛాం పియన్ షిప్ పోటీలకు సుమారు వందమందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరు సుధాకర్ తెలిపారు.
అండర్ 11, 13, 15, 17, 19 బాల బాలికలకు, మెన్ అండ్ ఉమెన్ , మాస్టర్స్ 35 ప్లస్ నుండి 75 ప్లస్ వరకు క్రీడాకారులు హాజరైనట్టు తెలియజేశారు. జిల్లా ఛాంపియన్ షిప్ పోటీలలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో హర్షవర్ధన్, కృష్ణ, రవి, మధు, శ్రీనివాస్ రెడ్డి, నంద శ్రీనివాస్, మహేష్, మురళి, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.