calender_icon.png 9 June, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

08-06-2025 11:24:28 PM

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా లక్ష రూపాయలు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు..

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలోని మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో మునిగి మృతి చెందిన యువకుల కుటుంబాలను ఆదివారం రాత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పరామర్శించారు. యువకులు మృతి చెందడం చాలా దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ఈ లోటును ఎవరూ భర్తీ చేయలేరని మంత్రి శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో తండ్రి ముందే తనయులు మునిగిపోవడం బాధాకరమని అన్నారు.

ఈ సంఘటన జరిగిన దాని సమాచారం రావడంతో వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులు మనోధైర్యంతో జీవించాలన్నారు. నేను వ్యక్తిగతంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లవేళలా మీకు అండగా ఉంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా అందజేయడంతో పాటు, ఇందిరమ్మ ఇల్లు ఇతర ప్రభుత్వ పథకాలను మృతుల కుటుంబాలకు అందించడం జరుగుతుందని తెలిపారు.

వ్యక్తిగతంగా తాను కష్టకాలంలో మృతుల కుటుంబాలను కుటుంబ సభ్యునిగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం మహాముత్తారం మండలంలోని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మంత్రి వెంట మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, రాష్ట్ర యువత అధికార ప్రతినిధి విలాస్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వామన్ రావు, మాజీ ఎంపిటిసి సుధాకర్, మాజీ సర్పంచ్ కోట లక్ష్మీ సమ్మయ్య, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.