09-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ 8 (విజయక్రాంతి): జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను గదులను గుర్తించి ఉపాధ్యాయులు వెంటనే నివేదిక ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఉపాధ్యాయులకు సూచించారు. ఆది వారం కడెం మండలంలోని పాత మద్ధిపడగ ఉన్నత పాఠశాలను సందర్శించి, శిథి లావస్థలో ఉన్న గదులను పరిశీలించారు.
ప్రధానోపాధ్యాయులు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ, గదుల పరిస్థితిని అంచనా వేసి, తగు చర్యల నిమిత్తం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. అవకాశముంటే కూల్చివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాలలలో శిథిలావస్థలో గల భవనాలను, గదులను గుర్తించాలని, వాటిని అలాగే ఉంచకుండా కూల్చివేసేందు కు అనుమతులు తీసుకోవాలని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త లింబాద్రి, మండల విద్యాధికారి షేక్ హుస్సే న్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు రాజేష్నాయక్ పాల్గొన్నారు.