15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

33% పెరిగిన బజాజ్ కన్స్యూమర్ కేర్

10-11-2025 05:28 PM

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసిజి సంస్థ బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్  రెండవ త్రైమాసికంలో ఫలితాలను సోమవారం ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో నికర లాభం 33 శాతం పెరిగి రూ.42.3 కోట్లకు చేరుకుంది. దీనికి అధిక అమ్మకాలు దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ.31.85 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. రెండవ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా దాని మొత్తం ఆదాయం రూ.265.27 కోట్లుకు పెరిగింది. గత ఏడాది రూ.233.98 కోట్లుగా ఉంది. వస్తువుల అమ్మకాల ద్వారా కంపెనీ ఆదాయం రూ.261.41 కోట్లుగా పెరిగి రూ.230.63 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది. రెండవ త్రైమాసికంలో దాని ఖర్చులు రూ.221.7 కోట్లుగా ఉన్నాయని, గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.204 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది.