calender_icon.png 8 June, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన

07-06-2025 06:31:17 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసి, పలుచోట్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో నిలువ నీడలేని పేదలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఇందిరమ్మ పథకంలో 5 లక్షల రూపాయల వ్యయంతో ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు.

ముందుగా ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు ఇండ్లు కట్టించి, రెండో దశలో స్థలము, ఇల్లు లేని పేదలకు పూర్తిగా ప్రభుత్వం స్థలం కేటాయించి ఇల్లు కట్టించి ఇస్తుందని చెప్పారు. దశలవారీగా నిలువ నీడలేని పేదలందరికీ ఇండ్లు కట్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఏండ్ల తరబడి నిలువ నీడ లేక ఇబ్బంది పడుతున్న తమకు ఇందిరమ్మ పథకంలో ఇండ్లు మంజూరు చేసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం పట్ల పలుచోట్ల నిరుపేదలు సంతోషం వ్యక్తం చేశారు.