26-06-2025 10:29:04 AM
సనత్ నగర్, (విజయక్రాంతి): బల్కంపేట్ శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లీ ఆలయంలో జూలై 1న జరగనున్న వార్షిక కళ్యాణ మహోత్సవంను పురస్కరించుకుని, భక్తుల రద్దీ, భద్రత, ఆరోగ్యం, ట్రాఫిక్ తదితర విభాగాల్లో సమన్వయం కోసం ముందస్తుగా కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశం వెస్ట్ జోన్ డీసీపీ శ్రీ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ మీటింగ్లో వివిధ శాఖల అధికారులు పాల్గొని కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లను సమీక్షించారు.
పాల్గొన్న ప్రముఖ అధికారులు:
డీసీపీ వెస్ట్ జోన్: విజయ్ కుమార్
అతిథి డీసీపీ: గోవర్ధన్
ఏసీపీ సంజీవ్ రెడ్డి నగర్ డివిజన్:రాఘవేంద్ర రావు
ఏసీపీ ట్రాఫిక్: హరిప్రసాద్
సంజీవ్ రెడ్డి నగర్ SHO: శ్రీనాథ్ రెడ్డి
SHO ట్రాఫిక్: శ్రీనివాస్ రెడ్డి
ఈవో, ఎల్లమ్మ దేవస్థానం: సంబంధిత అధికారులు
GHMC, హెల్త్, వాటర్ వర్క్స్, ఫైర్ సర్వీసెస్, TSRTC తదితర శాఖల అధికారులు
మీటింగ్ ముఖ్యాంశాలు:
భక్తుల రద్దీ దృష్టిలో సెక్యూరిటీ ప్లాన్ సిద్ధం చేయాలన్న డీసీపీ విజయ్ కుమార్ గారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం డైవర్షన్లు, సిగ్నేజీ ఏర్పాట్లు, తెచ్చే విధంగా l సూచనలు.
GHMC ద్వారా ఆలయం పరిసరాల పరిశుభ్రత, డ్రైనేజీ నిర్వహణపై చర్యలు.
ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు.
ఫైర్ డిపార్ట్మెంట్ ప్రత్యేక అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉండేలా సూచనలు.
వాలంటీర్ల సహకారంతో భక్తులకు సులభంగా.