మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ
23-03-2026 02:45 PM
మంథని,(విజయక్రాంతి): మంథని ప్రభుత్వం బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాలోజీ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ ప్రభుత్వ బాలుర కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా పనిచేస్తున్న బాలోజీ ప్రిన్సిపాల్ గా పదోన్నతి పొందారు. ఇప్పటి వరకు ఇన్చార్జిగా మంథని బాలుర కళాశాల ప్రిన్సిపల్ ఉషా కొనసాగారు. ప్రిన్సిపల్ గా పదవీ బాధ్యతలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, అందరి సహకారంతో కళాశాల అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.




