జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు
23-03-2026 02:43 PM
అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలంలోని జగన్నాథ్ పూర్ సాగునీటి ప్రాజెక్టుకు రూ.135 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. గత కొన్ని ఏళ్లుగా నిధుల కొరత కారణంగా ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కాగజ్ నగర్, దహేగాం మండలాల్లోనూ వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉండాలి. నిధులు మంజూరు చేసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తగిన చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.




