22 May, 2026 | 9:30 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు

23-03-2026 02:43 PM

అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలంలోని జగన్నాథ్ పూర్ సాగునీటి ప్రాజెక్టుకు రూ.135 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. గత కొన్ని ఏళ్లుగా నిధుల కొరత కారణంగా ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కాగజ్ నగర్, దహేగాం మండలాల్లోనూ వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉండాలి. నిధులు మంజూరు చేసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తగిన చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.