calender_icon.png 27 June, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి రమేష్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

27-06-2025 12:17:07 PM

సీతంపేట లో రమేష్ పార్థివ దేహానికి నివాళులో మాజీ జడ్పీటీసీ  చొప్పరి సదానందం

ముత్తారం,(విజయక్రాంతి): బండి రమేష్ ఆకస్మిక మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు(Congress Party District Vice Presidents), ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం అన్నారు. శుక్రవారం మండలంలోని సీతంపేట మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బండి శ్రీదేవి భర్త రమేష్ అనారోగ్యంతో హైదరాబాదులో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆదేశాల మేరకు సదానందం సీతంపేట లో రమేష్ పార్థివదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రమేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మీ కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయన్నారు.  సీతంపల్లి మాజీ సర్పంచ్ పులిపాక నాగేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలు రమేష్ కు నివాళులర్పించారు.