calender_icon.png 27 June, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

27-06-2025 12:41:40 PM

మహదేవపూర్, (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల(Mahadevpur Mandal) కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం సమీపంలోని చిల్డ్రన్స్ పార్కును రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... నేటి సమాజంలో వ్యాయామము చేయలేకపోతున్నా తల్లిదండ్రులు పిల్లలకు వ్యాయామం చేయడం కొరకు రూ.20 లక్షల నిధులతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును(Children's Park) ప్రారంభోత్సవం చేయడం జరిగిందని, విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కొరకు 54 బ్యాటరీ సైకిల్స్ ను దివ్యాంగులకు పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కులను కూడా పంపిణీ చేశారు.