calender_icon.png 27 June, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి

27-06-2025 11:57:15 AM

పెద్దపల్లి, (విజయక్రాంతి):  గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీ కొని  ఇద్దరు యువకులు మృతి చెందినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్(Peddapalli Rural SI Mallesh) తెలిపారు. పెద్దపల్లి, గోదావరిఖని ప్రధాన రహదారి(Godavarikhani main road) పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట వద్ద హైదరాబాద్ నుండి గోదావరిఖని కి ద్విచక్ర వాహనంపై శుక్రవారం ఉదయం వెళ్తుండగా గోదావరిఖని పట్టణానికి చెందిన చక్రి, శ్యామ్  అప్పన పేట సమీపంలో గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో  ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, సంఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు.