21-06-2025 02:01:22 AM
కరీంనగర్ క్రైం, జూన్20(విజయక్రాంతి):కరీంనగర్ జ్యోతినగర్ లోని శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న స్వామివారి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
సతీసమేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నా రు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పూజారులు బండి సంజయ్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. స్థానిక కార్పొరేటర్ బండి రమణారెడ్డి, మాజీ కార్పొరేటర్ వేదం తోపాటు పలువురు బీజేపీ నాయకులు ఈ బ్రహ్మోత్సవాల్లోపాల్గొన్నారు.