దేశ ప్రధానిగా ఓబీసీ నేతను చేసింది బేజేపీనే
హైదరాబాద్: బీజేపీ నాగోల్ లో నిర్వహించిన వర్క్ షాప్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. గత ప్రభుత్వంలో 12 మంది ఎస్సీలను కేంద్రమంత్రులను చేసింది బీజేపీ అన్నారు. సభ్యత్వ నమోదు సమయంలో ఎస్సీ మోర్చా సభ్యత్వాల నమోదు చేయించాలని బండి సంజయ్ సూచించారు. దేశ ప్రధానిగా ఓబీసీ నేతను చేసింది బీజేపీనేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి బీజేపీ చేసిన పనులు చెప్పి సభ్యత్వ నమోదు చేయించాలని తెలిపారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసిన గొప్పనేత ప్రధాని మోడీ అని బండి సంజయ్ కొనియాడారు. బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతంతో పనిచేస్తున్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రతి కార్యకర్త త్యాగాన్ని బీజేపీ గుర్తు చేసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ.. ఆ పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడదని బండిసంజయ్ ఆరోపించారు.






