Good news: డిప్యూటీ తహశీల్దార్లకు తెలంగాణ సర్కార్ ఖుష్ ఖబర్
30-08-2024 12:36 PM
హైదరాబాద్: డిప్యూటీ తహశీల్దార్లకు తెలంగాణ సర్కార్ ఖుష్ ఖబర్ చెప్పింది. రాష్ట్రంలోని 83 మంది డిప్యూటీ తహశీల్దార్ లకు తహశీల్దార్ లు గా ప్రమోషన్ కలిపించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డిలకు టీజీటీఏ ధన్యవాదాలు తెలిపింది. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కృషి కారణంగానే టీజీటీఏ డీటీలకు పదోన్నతులు లభించాయని తహసీల్దార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.






