4 July, 2026 | 9:32 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

రైతు భరోసా నిధులు విడుదల పట్ల కాంగ్రెస్ నాయకుల సంబరాలు

04-07-2026 07:54 PM

బేల,(విజయక్రాంతి): తెలంగాణలో ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేయడంపై బేల మండల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ శివాజీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాంఖడే రుప్ రావ్ మాట్లాడుతూ... ఇచ్చిన మాట ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ, వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎకరానికి 12వేల రూపాయలు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతు భరోసా సహాయం అందడం ద్వారా రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, రైతులు పాల్గొన్నారు.