23-02-2026 02:16:37 AM
సద్దుమణిగిన ఉద్రిక్తత
ఉద్రిక్తతకు కారణమైన వారి అరెస్టు
బాన్సువాడ వెళ్లకుండా బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
కామారెడ్డి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కొనసాగిన ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశా రు. ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
అయితే బీజేపీ, ఇతర సంఘాల యువకులపై పోలీసులు అకారణంగా కేసులు నమోదు చేశారంటూ వారిని పరామర్శించేందుకు ఆదివారం బాన్సువాడకు వచ్చేందుకు ప్ర యత్నించిన బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణను పోలీసులు అడ్డుకుని, నిజామాబాద్ పంపించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న బీజేపీ నాయకులను సైతం అడ్డుకొని వెనక్కి పంపించారు. రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డిని ఎల్లారెడ్డి దాటి న తర్వాత పోలీసులు అడ్డుకుని, వెనక్కి పంపించారు. మాజీ ఎంపీ బీబీ పాటిల్ను బుడిమీ వద్ద అడ్డుకున్నారు.