calender_icon.png 2 October, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బతుకమ్మ ఉత్సవ సంబురాలు

02-10-2025 12:08:17 AM

సనత్‌నగర్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి):- సనత్ నగర్ డివిజన్ ఎస్‌ఆర్‌టీలో బీఆర్‌ఎస్ సీనియర్ లీడర్ బోటిక్ ఎండి ఝాన్సీ రెడ్డి శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో యువత బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి పేర్చి చోటు చక్కని నృత్యాలతో సరికొత్త స్టెప్పులతో ఎక్కడ తగ్గేది లేదు అంటూ చెబుతా బతుకమ్మ పాటలతో ఆడిపడి ఆకట్టుకున్నారు.

ఈ సం దర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ ముం దుగా అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మలను అందంగా అలంకరించి తెచ్చిన వారికి ప్రత్యేక బహుమతులు అందిస్తామని, రాష్ట్ర ప్రజలందరూ దుర్గామాత ఆశీస్సులతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు.

ఏవీసీఐ ఆధ్వర్యంలో..

సనత్‌నగర్ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలు ఈ ఏడాది కూడా ఏవీసీఐ (ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్) ఆధ్వర్యంలో వైభవంగా యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించారు. 25 రకాల పువ్వులతో అలంకరించిన 25 అడుగుల బతుకమ్మతో సంబురాలు నిర్వహిం చారు. ఈ వేడుకకు హైకోర్టు జడ్జి నందా గుప్త , ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, ఎమ్మెల్సీ శ్రీనివాస్, పోలీస్ కమాండర్ మురళి కృష్ణ, సిల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు, విశిష్ట గోల్డెన్ డైమండ్స్ చైర్మన్ పలబట్ల ఆనంద్ సహా పలువురు ప్రముఖులు హాజరై విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమం బుక్ ఆఫ్ రికార్డ్ చోటు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్గా సహకరించిన విశిష్ట గోల్డెన్ డైమండ్స్ చైర్మన్ పలబట్ల ఆనంద్ బాబుకి, అసోసియేట్ స్పాన్సర్‌గా తోడ్పడిన సెల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావుకి, శారద సారీస్- మోతీనగర్, కొండాపూర్, ఆదిత్య బిర్లా ఇంద్రియ, జిగిని శ్రీనివాస్, విజయ లక్ష్మీ డైమండ్స్- పంజాగుట్ట  అంతేకాక, ఈ వేడుక విజయానికి తోడ్పడిన టీమ్ సభ్యులందరికీ కెఎస్‌ఆర్. మూర్తి  (ఏవీసీఐ ఫౌండర్ & చైర్మన్) డా. సరాఫ్ తులసి గుప్తా  (ఏవీసీఐ నేషనల్ సెక్రటరీ) డా. సిద్ధి స్వాతి  (ఏవీసీఐ తెలంగాణ సెక్రటరీ) ఇంటర్నేషనల్ హ్యూమన్ రైస్ కమిటీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్ యూత్ ప్రెసిడెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ సెక్రటరీ వాడకట్టు శ్రీకాంత్ గుప్తా కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

రవీంద్ర నగర్ కాలనీ ప్రెసిడెంట్ విజయ్ సింగ్ ఆధ్వర్యంలో..

సనత్ నగర్ డివిజన్ రవీందర్ నగర్ కాలనీలో ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవ కార్యక్రమాలలో రవీంద్ర నగర్ కాలనీ ప్రెసిడెంట్ విజయ్ సింగ్ ఆధ్వర్యంలో కార్పొరేట ర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి రవీంద్ర నగర్ మహిళా మణులతో కలిసి సందడి చేశారు బతుకమ్మ ఉత్సవ వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మతో ఆడి పాడి అందరినీ ఉత్సాహపరిచారు.

వచ్చిన ముఖ్యఅతిథికి విజయ్ సింగ్ చాలా వాళ్ళతో ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్  సభ్యులు పార్థసారథి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆల య మాజీ పాలకమండలి సభ్యులు కొలను భూపాల్ రెడ్డి ,సనత్ నగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముదిరాజ్, షమీవుల్లా, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.