15-06-2025 12:22:33 AM
ప్రారంభించిన తెలంగాణ ప్రథమ మహిళ సుధాదేవ్ జీ వర్మ
ముషీరాబాద్, జూన్ 14 (విజయ క్రాంతి) : కెరీర్ ఆధారిత విద్యతో యువతులను సాధికార పరచడంలో గణనీయమైన ముందడుగులో, సుమన్ జూనియర్ కాలేజ్ ఫర్ గరల్స్, విడి. బజాజ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, మహిళా దక్షత సమితి, బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లతో కూడి న మహిళా దక్షత సమితి విద్యా సంస్థ లు శనివారం గంగారంలో తమ బ్యా చిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బిబిఎ) కోర్సును ప్రారంభించాయని ఒక ప్రకటనలో తెలిపారు.
గౌరవ అతిథులుగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడె న్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ(టిఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి డాక్టర్ విఎస్.అళగు వర్షిణి ఐఎఎస్, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్, ఇన్ఫోసిస్ ఫౌండే షన్ హెడ్ మనీషా సబూ, టెక్ మహీం ద్రా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పల్లవి కటియార్ హాజరయ్యారు. మహిళా దక్షత సమితి అధ్యక్షురాలు డాక్టర్ సరోజ్ బజాజ్ మాట్లాడుతూ మహి ళా దక్షత సమితి బ్యానర్ కింద ఉన్న జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల, వృత్తి శిక్షణా కేంద్రం వంటి వివిధ కళాశాలల గురించి వివరించారు.