15-06-2025 12:23:32 AM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వినతి పత్రం..
రాజేంద్రనగర్: మౌలిక వసతులు కల్పించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్(MLA Prakash Goud)కు వినతిపత్రం అందజేశారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్ లో ఉన్న శ్రీ యాదాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రైనేజీ సౌకర్యం, అంతర్గత రోడ్లు, అదేవిధంగా సరైన విద్యుత్ వసతి చాలాకాలంగా ఇక్కట్లకు గురవుతున్నామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వివరించారు. అన్ని సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే .. సత్వరం సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ యాదాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుకర్, కమిటీ సభ్యులు రఘుగౌడ్, సంపత్ గౌడ్, భుదియా నాయక్, నరేందర్ రెడ్డి, మహేష్, శ్యామ్ లాల్, రాజేష్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.