15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బాల్ పోటీలకు బిసి గురుకుల పాఠశాల విద్యార్థుల ఎంపిక

17-02-2026 09:25 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నమెంట్ జిల్లా స్థాయి బేస్ బాల్ పోటిలో అవంతీపురం మహాత్మ జ్యోతిభా పూలే బిసి గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా పోటీల్లో అద్భుత ప్రతిభ చాటిన సాయి శివ, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయిచరణ్ లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 

ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపల్  పి.నవీన్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను క్రీడల్లో రాణించేలా తీర్చి దిద్దిన పి.డి., పి.ఇ.టి. లను ప్రిన్సిపాల్  ఉపాధ్యాయ బృందం తోపాటు ఉపాధ్యాయులు నాగేంద్రమ్మలు అభినందనలు తెలిపారు.