17-02-2026 09:25:59 PM
మిర్యాలగూడ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నమెంట్ జిల్లా స్థాయి బేస్ బాల్ పోటిలో అవంతీపురం మహాత్మ జ్యోతిభా పూలే బిసి గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా పోటీల్లో అద్భుత ప్రతిభ చాటిన సాయి శివ, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయిచరణ్ లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపల్ పి.నవీన్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను క్రీడల్లో రాణించేలా తీర్చి దిద్దిన పి.డి., పి.ఇ.టి. లను ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ బృందం తోపాటు ఉపాధ్యాయులు నాగేంద్రమ్మలు అభినందనలు తెలిపారు.