23-06-2025 12:19:36 AM
ఎల్బీనగర్, జూన్ 22 : బీసీలు రాజకీయ చైతన్యం సాధించి, రాజ్యాధికారం పొందాలని మన ఆలోచన సాధన సమితి (ఎంఏఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు పిలుపునిచ్చారు. మన ఆలోచన సాధన సమితి (MASS) రాష్ట్ర కమిటీ మొదటి కార్యవర్గ సమావేశం నాగోల్ లోని ‘మాస్‘ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు గడ్డం నరసింహ గౌడ్, దొంత ఆనందం, పూస నర్సింహ బెస్త, నేరెళ్ల దేవేందర్ తదితరులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్ రావు మాట్లాడుతూ... గ్రామాల్లో అనైక్యతగా ఉన్న బీసీ (కుల వృత్తులు చేసుకునే) కులాలు మధ్య సఖ్యత సాధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో చైతన్యం తేవడానికి మన ఆలోచన సాధన సమితి (మాస్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృషి చేయాలన్నారు.
నెల రోజులపాటు గ్రామబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మన ఆలోచన సాధన సమితి(మాస్) కమిటీలు నిర్మించి, జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో బీసీ యువతక, నాయకులకు శిక్షణా శిబిరాలు, ఓరియంటేషన్ తరగతుల నిర్వహించాలని సమావేశంలో తీర్మానం ఆమోదించారు.
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరంగి దుర్గ రాణి రజక, గుండ్ల ఆంజనేయులు గౌడ్, గుంటిపాటి పూసల, విద్యాసాగర్ ముదిరాజ్ , కోరంగి దుర్గారాణి రజక, పంతంగి విటలయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, బచ్చనబోయిన శ్రీనివాసులు యాదవ్, గోదా మల్లికార్జున్ గౌడ్, కార్యదర్శులు గౌటి రమాదేవి, గాది కృష్ణయ్య నాయీ, పన్నీరు సత్యం పూసల, వట్టిపల్లి వెంకటేశ్ రజక తదితరులుపాల్గొన్నారు.