23-06-2025 12:19:31 AM
- ఆందోళనలు చేపడతాం : మాలల చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూలే కేశవులు
మహబూబ్ నగర్ టౌన్ జూన్ 22 : ప్రైవేటు పాఠశాలలో ఇష్టం సారంగా ఫీజులు పెంచుతూ వ్యవహరిస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని మాలల చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూల కేశవులు అన్నారు.
పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసు కోవాలని, లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా కేంద్రంలోని రోడ్ల భవనాల అతిథి గృహం నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు స్పందించిన యెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనల కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోపత్తి యాదయ్య మంత్రి వెంకట్రాములు, గా జుల యాదగిరి, ఇమ్మడి సైదులు, నరసింహ, నిరంజన్, కృష్ణయ్య, చెన్నయ్య, కృష్ణయ్యఉన్నారు.