16 April, 2026 | 8:13 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

వర్షాలపై అప్రమత్త ఉండండి

24-02-2026 01:04 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): వర్షాకాలంలో, నిర్మల్ పట్టణంలో వరదలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, వర్షాకాలం వరదల నివారణపై చేపట్టవలసిన చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మల్ పట్టణంలో వర్షాకాలం అధికంగా ఇబ్బందు లు కలిగే ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపా రు.

అవసరమైన చోట కల్వర్టర్లు నిర్మించాలని పేర్కొన్నారు. ముందస్తు పటిష్ట ప్రణాళికల ద్వారా పట్టణంలో వరదల వల్ల నష్టాలను నివారించగలుగుతామని వివరించారు. పటిష్ట చర్యలు చేపట్టి, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఈ అనిల్, తహసిల్దార్ రాజు, మున్సిపాలిటీ డిఈ హరిభువన్ పాల్గొన్నారు.