19-06-2025 04:32:54 PM
ఫైర్ అధికారి కార్తీక్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఫైర్ అధికారి కార్తీక్(Fire Officer Karthik) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... షాపింగ్ మాల్స్, హాస్పిటల్ తదితర కమర్షియల్ భవనాలలో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై హాస్పిటల్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫైర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.