calender_icon.png 19 June, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం

19-06-2025 04:30:55 PM

ఎస్పీ కాంతిలాల్ పాటిల్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మరణించిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్(SP Kantilal Patil) అన్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్ ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులకు రూ. 8 లక్షల భద్రత చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పోలీస్ శాఖలో పనిచేస్తూ వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడు తోడుగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా రావలసిన బెనిఫిట్స్ ను సకాలంలో అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఆనంద్ కుమార్ కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బి సీఐ రా ణా ప్రతాప్, పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి, ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, కార్యాలయ ఏవో శ్రీనివాస్,సూ పరిండెంట్ ఖలీల్ పాల్గొన్నారు.