calender_icon.png 14 June, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపన్నులకు సహాయం చేయడంలో ముందుండాలి

13-06-2025 02:25:57 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

హనుమకొండ, జూన్ 12 (విజయ క్రాంతి): సమాజంలో ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో ఆపదమిత్ర వాలంటీర్లు  ముందుండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ లోని అంబేద్కర్ భవన్ లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 12 రోజులపాటు నిర్వహించిన ఆపద మిత్ర వాలంటీర్ల  శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని  నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆపదమిత్ర వాలంటీర్లు ఏవైనా అనుకోని విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. వాలంటీర్లు ఎంతోమంది జీవితాలను మార్చగలరని నమ్మకం ఉందన్నారు.

హనుమకొండ, పరకాల డివిజన్లలోవిజయవంతంగా నిర్వహించినందుకు అగ్నిమాపక, నెహ్రూ యువ కేంద్ర, ఇతర అధికారులకు అభినందనలు తెలియజేశారు. జిల్లా అగ్నిమాపక అధికారి నాగరాజు మాట్లాడుతూ మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో 126 మంది, పరకాలలో 131 మంది వాలంటీర్లకు 12 రోజులపాటు శిక్షణ కార్యక్రమా న్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఆపదమిత్ర వాలంటీర్లకు సర్టిఫికెట్లు, ఐడి కార్డులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల, పరకాల మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్  జయశ్రీ, సైకాలజిస్ట్ శ్రీనివాస్, శిక్షణ పొందిన ఆపదమిత్ర వాలంటీర్లు పాల్గొన్నారు.