13-06-2025 02:26:22 AM
కరీంనగర్, జూన్ 12 (విజయ క్రాంతి): వివిధ జాతీయ స్థాయి ఒంలపియాడ్లలో కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాల విద్యార్థులు బంగారు పతకాలతో పాటు నగదు బహుమతులను సాధించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలకు చెందిన రసగ్న ఇంగ్లీష్ ఒలంపియాడ్లో బంగారు పతకం, హేమంత్ జాదవ్ కంప్యూటర్ ఒలంపియాడ్లో బంగారు పతకం, ఎ. శ్రీయాన్ రెడ్డి, యు. సాత్రివ్, ఇ. లిఖిత్ కుమార్, పి. నమన్విత హింది ఒలంపియాడ్ లో బంగారు పతకాలు, హవీష్ రెడ్డి, యం. శివేన్ రెడ్డి సోషల్ ఒలంపియాడ్లో బంగారు పతకాలు,
ఎ. యశ్ చంద్ర సోషల్ ఒలంపియాడ్ స్టేట్ టాపర్, బి. తన్మయి నేషనల్ ఎస్సే ఒలంపియాడ్లో స్టేట్ ర్యాంక్, ముగ్గా హాసిని ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్లో స్టేట్ ర్యాంక్, ఎ. శ్రీయాన్ రెడ్డి సోషల్ ఒలంపియాడ్లో స్టేట్ ర్యాంక్ లు సాధించారని తెలిపారు. సందర్భంగా విద్యార్థుల అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.