12-02-2026 10:06:51 AM
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎలుగుబంటి చిక్కింది. మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు(Maharashtra Forest Department officials) ఎలుగుబంటి కోసం ఆపరేషన్ చేపట్టారు. మహారాష్ట్రలోని దయాల్ ధన్నూర్ గ్రామంలో ఎలుగుబంటి ఎనిమిది మందిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఎలుగుబంటి బాధితులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన అనంతరం ఎలుగుబంటి తెలంగాణ వైపు వచ్చినట్లు అధికారలు వెల్లడించారు. అటవీ శాఖ అధికారులు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎలుగుబంటిని బోనులో బంధించారు.