05-06-2025 12:00:00 AM
నాగార్జునసాగర్, జూన్ 4: నాగార్జునసాగర్ పైలాన్ బైపాస్ నందు బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్ల యాచకుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. చుట్టుపక్కల వారిని విచారించగా అతడు గత వారం రోజులుగా పైలాన్ లో సంచరిస్తూ భిక్షాటన చేస్తూ ఫుట్ పాత్ పై పడుకుంటూ జీవిస్తున్నాడు అని,అతని వయసు సుమారు 70 సంవత్సరాలు ఉండి హిందీ మాట్లాడుతున్నాడు అని తెలపడం జరిగింది.అతని ఆచూకీ తెలిసిన యెడల విజయపురి టౌన్ ఎస్ఐ తెలియపరచగలరు.