calender_icon.png 17 June, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యా బోధన

17-06-2025 04:44:35 PM

ప్రభుత్వ బడిలో తన బిడ్డను చేర్పించిన ఉపాధ్యాయుడు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యా బోధన జరుగుతుందని, అలాగే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో విద్యార్థులు చక్కగా చదువుకోవచ్చని మహబూబాబాద్ జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి(District Education Officer Dr. A. Ravinder Reddy) అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సయ్యద్ తన కూతురు తయ్యబాను కేసముద్రం మండలం కల్వల ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మంగళవారం నిర్వహించిన బడిబాట ప్రచార కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్ తో కలిసి డీఈవో పాల్గొన్నారు. అదే విధంగా కలవల ఉన్నత పాఠశాల పదవ తరగతి టాపర్స్, కే.తేజస్విని, వై.వెన్నెల, జి.శివానిని అభినందించారు.

గణితంలో వందకు వంద మార్కులు సాధించిన వై.వెన్నెలకు పాఠశాల గణిత ఉపాధ్యాయులు తండా సదానందం వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందజేయగా, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి 3,016 రూపాయలు అందజేశారు. తర్వాత ప్రాథమిక పాఠశాలలో 65 అడ్మిషన్లు చేసిన ప్రధానోపాధ్యాయులు కళ్ళెం వీరారెడ్డి, తన బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు సయ్యద్ ను, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్, మిగతా ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు ఆజాద్, అప్పారావు, మండల విద్యాధికారి కాలేరు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.